Revised Common Lectionary (Complementary)
105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
2 యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
3 యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
4 బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
5 యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
6 దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
7 యెహోవా మన దేవుడు.
యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
8 దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
9 దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
అని దేవుడు చెప్పాడు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.
యెహోవాను స్తుతించండి.
12 యెహోవా ఇలా అంటున్నాడు:
“ఓ ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీకు బాగుకాని గాయం ఉంది.
మీకు తగిలిన దెబ్బ నయం కానిది.
13 మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు.
అందుచేత మీరు స్వస్థపర్చబడరు.
14 మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు.
అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టించుకోవు.
మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని మర్చిపోయారు.
ఒక శత్రువువలె మిమ్మల్ని గాయపర్చాను!
మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షించాను!
మీరు చేసిన ఘోరమైన నేరం కారణంగా నేనలా చేశాను.
మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేనలాచేశాను.
15 ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి ఎందుకు రోదిస్తున్నారు.
మీ గాయం బాధకరమైనది.
పైగా దానికి చికిత్స లేదు.
ఘోరమైన మీ అపరాధం కారణంగా, యెహోవానైన నేను మీకవన్నీ కలుగజేశాను.
మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేను మీకు ఈ కష్టాలు కలుగజేశాను.
16 ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు.
కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి.
ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు!
ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నారు.
కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు.
ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు.
అలాగే యితరులు యుద్ధంలో వారి వస్తువులు తీసుకుంటారు.
17 అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చుతాను.
మీ గాయాలన్నీ మాన్పుతాను.” ఇదే యెహోవా వాక్కు,
“ఎందువల్లననగా అన్యులు మిమ్మల్ని వెలివేసి భ్రష్టులన్నారు.
‘సీయోనును ఎవ్వరూ లెక్కచేయరు’ అని వారన్నారు!”
18 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు.
కాని వారు తిరిగివస్తారు.
యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను.
నగరమంతా[a] కూలిపోయిన భవనాలతో
కప్పబడిన కొండలా ఉంది.
కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది.
రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది.
19 ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు.
ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి.
వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను.
ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు.
వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను.
ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు.
20 యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
ఇశ్రాయేలు. యూదా ప్రజలను నేను శక్తివంతులుగా చేస్తాను.
అంతేగాదు; వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను.
21 వారి స్వజనులలో ఒకడు వారికి నాయకత్వం వహిస్తాడు.
ఆ పాలకుడు నా ప్రజలలోనుండే వస్తాడు.
నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు రాగలరు.
అందుచేత ఆ నాయకుని వావద్దకు పిలుస్తాను.
అతడు నాకు సన్నిహితుడవుతాడు.
22 మీరు నా ప్రజలై ఉంటారు.
నేను మీ దేవుడనై ఉంటాను.”
36 వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు.
యూదులు నిరాకరించటం
37 యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు. 38 ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది:
“ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు?
ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?”(A)
39 అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది:
40 “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి,
వాళ్ళ హృదయాలు మూసి వేశాడు.
వాళ్ళు చూడరాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం.
అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు
వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.”(B)
41 యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు.
42 ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. 43 ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం.
© 1997 Bible League International