Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 1-3

ఇవి యిర్మీయా వర్తమానాలు. యిర్మీయా తండ్రి పేరు హిల్కీయా. అనాతోతు నగరంలో నివసించే[a] యాజకుల కుటుంబానికి చెందిన వాడు యిర్మీయా. ఆ నగరం బెన్యామీను వంశానికి చెందిన వారి ప్రాంతంలో వుంది. యూదా రాజ్యాన్ని యోషీయా పాలిస్తున్న రోజులలో యెహోవా యిర్మీయాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. యోషీయా తండ్రి పేరు ఆమోను. యోషీయా రాజ్యపాలన పదమూడవ సంవత్సరం[b] జరుగుతూ ఉండగా యెహోవా యిర్మీయాతో మాట్లాడటం ప్రారంభించాడు. యెహోయాకీము యూదాకు రాజై యున్న కాలం వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం కొనసాగించాడు. యెహోయాకీము తండ్రి పేరు యోషీయా. సిద్కియా రాజ్యపాలన యూదాపై పదకొండు సంవత్సరాల ఐదు మాసాలు జరిగే వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం సాగించాడు. సిద్కియా కూడ యోషీయా కుమారుడే. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాలు దాటి ఐదవ నెల జరుగుతూ ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలు బందీలుగా కొనిపోబడ్డారు.

యిర్మీయాకు దేవుని పిలుపు

యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది.

“నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే
    నిన్ను నేనెరిగియున్నాను.
నీవు పుట్టకముందే
    నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను.
    దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.”

అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడవైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.

కాని యెహోవా ఇలా అన్నాడు:

“బాలుడనని అనవద్దు.
    నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి.
    నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి.
ఎవ్వరికీ భయపడకు.
    నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”.
ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది.

పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు:

“యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను.
10 దేశాలను, సామ్రాజ్యాలను ఈ రోజు నీ జవాబుదారిలో ఉంచుతున్నాను.
    నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు.
    నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు.
    నీవు వాటిని కట్టి నాటుతావు.”

రెండు దర్శనాలు

11 యెహోవా యొక్క సందేశం నాకు చేరింది యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తూ ఉన్నావు?”

అప్పుడు యెహోవాకు నేనిలా సమాధాన మిచ్చాను: “బాదపు చెట్టుకొమ్మతో చేయబడిన ఒక కర్రను నేను చూస్తున్నాను.”

12 “నీవు చాలా బాగా కనిపెట్టావు. నేను నీకిచ్చిన సందేశం నిజం కావాలని ఎదురు చూస్తున్నాను”[c] అని యెహోవా అన్నాడు.

13 యెహోవా సందేశం నాకు మళ్లీ వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు?”

“నేను ఒక మరుగుతున్న నీళ్ల కుండను చూస్తున్నాను. ఆ కుండ ఉత్తర దిశనుండి ఒరిగి ఉంది” అని నేను యెహోవాకు చెప్పాను.

14 నాతో యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర దిశనుండి ఉపద్రవం రాబోతూవుంది.
    ఈ దేశంలో నివసిస్తూ ఉన్న వారందరికీ ఆ విపత్తు వస్తుంది.
15 అనతి కాలంలోనే ఉత్తర ప్రాంత సామ్రాజ్యాల ప్రజలందరికీ నేను పిలుపు యిస్తాను.”
ఇది యెహోవా వాక్కు.

“ఆయా రాజ్యాధినేతలు వస్తారు.
    యెరూషలేము ద్వారాల వద్ద వారు తమ సింహాసనాలను ప్రతిష్ఠించుతారు.
యెరూషలేము నగర గోడలమీదికి దండెత్తి వస్తారు.
    యూదా రాజ్యంలోని అన్ని నగరాలపై వారు దండయాత్రలు చేస్తారు.
16 అప్పుడు నా ప్రజలపై నా తీర్పును ప్రకటిస్తాను.
    వారు చెడు నడతగల వారగుటచేతను, వారు నాపట్ల విముఖులైనందువల్లను నేనిది చేస్తున్నాను. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు.
ఇతర దేవతలకు వారు బలులు అర్పించారు. వారి చేతితో వారు చేసిన బొమ్మలనే వారు ఆరాధించారు.

17 “యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు.
    ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు.
నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి.
    ప్రజలకు నీవు భయపడవద్దు.
నీవు ప్రజలకు భయపడితే,
    వారిముందు నీవు భయపడటానికి తగిన కారణం కల్పిస్తాను.
18 నేను మాత్రం ఈ రోజు నిన్నొక
    బలమైన నగరం మాదిరిగాను,
    ఒక ఇనుప స్థంభం వలెను,
    ఒక కంచుగోడ వలెను బలపరుస్తాను.
దానివల్ల ఈ రాజ్యంలో ప్రతి వాని ఎదుట
    నీవు ధైర్యంగా నిలువగలవు.
    యూదా రాజుల ఎదుట,
    యూదా నాయకుల ఎదుట,
    యూదా యాజకుల ఎదుట,
    మరియు యూదా ప్రజల ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు.
19 వారంతా నిన్నెదిరిస్తారు;
    కాని నిన్ను ఓడించలేరు.
ఎందుకంటె నేను నీతో ఉన్నాను;
    నేను నిన్ను ఆదుకుంటాను.”
ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.

విశ్వాసంలేని యూదా

యెహోవా యొక్క వర్తమానం నాకు వినబడింది. యెహోవా వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి:

“‘నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు విశ్వాసంగా ఉన్నావు.
    ఒక యౌవ్వన వధువులా నీవు నన్ననుసరించావు.
ఎడారులలోను, సాగుచేయని బీడు భూములలోను
    నీవు నన్ను అనుసరించావు.
ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము:
    వారు యెహోవా ఏర్పచుకొన్న ప్రథమ ఫలం.
ఇశ్రాయేలుకు హాని చేయబోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు.
    ఆ దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.’”
ఇది యెహోవా వాక్కు.

యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి.
    ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.

యెహోవా ఇలా చెప్పాడు:
“మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా?
    అందుకేనా వారు నాపట్ల విముఖులైనారు?
మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
    తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.
‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి
    తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మాకు ఎడారులలో మార్గదర్శి అయిన
    యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో
    సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ,
    ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు.
    ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు.
కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’
    మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”

ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో
    నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను.
మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను.
    కాని మీరు వచ్చి, నా దేశాన్ని అపవిత్ర పర్చారు.
ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను.
    అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.

“యెహోవా ఎక్కడ అని
    యాజకులు అడగలేదు.
నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.
    ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు.
బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు.
    వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను
    నేను నిందిస్తున్నాను.
10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి[d] వెళ్లి చూడండి.
    ఒకనిని కేదారు[e] రాజ్యానికి పంపి, శ్రద్ధగా పరిశీలించమనండి.
అక్కడ ఎవరైనా ఈ రకంగా
    ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.
11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను
    క్రొత్త దేవుళ్లతో మార్చుకున్నారా?
లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు
అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని
    పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.

12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి.
    భయకంపితులుకండి!”
యెహోవా ఇలా చెప్పాడు.
13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు:
వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు
    పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు.
(వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.)
    కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.

14 “ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారా?
    వారు పుట్టుకతో బానిసలుగా తయారైనారా?
    ఇశ్రాయేలు ప్రజలను ఇతరులు ఎందుకు కొల్లగొడుతున్నారు?
15 యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి.
    సింహాలు కోపంతో గుర్రుమంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజల దేశాన్ని సింహాలు నాశనం చేశాయి.
ఇశ్రాయేలు నగరాలు తగులబెట్టబడ్డాయి.
    అవి నిర్మానుష్యమైనాయి. వాటిలో ప్రజలెవ్వరూ లేరు.
16 మెం‌ఫిస్, తహపనేసు[f] వీటినుండి వచ్చిన
    యోధులు నీ తల చితుకగొట్టారు.
17 ఈ కష్టానికంతటికి నీ తప్పులే కారణం!
    చక్కని మార్గంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న[g]
    మీ దేవుడైన యెహోవా నుండి మీరు తొలగిపోయారు
18 యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి:
    ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా?
    నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది?
    లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది?
    యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు.
19 మీరు చెడు పనులు చేశారు.
    మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి.
మీకు కష్టాలు సంభవిస్తాయి.
    ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది.
దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది.
    నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని!”
ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది.
20 “యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు.
    నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు.
    ‘నేను నిన్ను సేవించను’ అని నన్ను తిరస్కరించావు.
నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టుక్రింద
    పండుకొని పచ్చి వేశ్యలా ప్రవర్తించావు.[h]
21 యూదా, నిన్నొక మేలురకం ద్రాక్షపాదువలె నాటాను.
    మీరంతా మేలురకం విత్తనాల్లా ఉన్నారు.
కాని నాసిరకం పండ్లనిచ్చే వేరొక రకం ద్రాక్షలతల్లా ఎలా తయారయ్యారు?
22 క్షారజలంతో స్నానం చేసుకున్నా,
    నీవు విస్తరించి సబ్బు వినియోగించినా
    నేను నీ దోష కళంకాన్ని చూడగలను.”
ఈ వర్తమానం దేవుడైన యెహోవాది.
23 “యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’
    నీవెలా నాకు చెప్పగలవు?
లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి ఆలోచించుకో.
    నీవు ఏమిచేశావో గుర్తుకు తెచ్చుకో.
నీవొక వడిగల ఆడ ఒంటివలె
    ఒక చోటినుండి మరో చోటికి పరుగెత్తావు.
24 ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు.
    సంగమ సమయంలో అది గాలిని వాసనచూస్తూ తిరుగుతుంది.
    మిక్కిలి ఎదగొన్నప్పుడు దానిని ఎవ్వరూ వెనుకకు మరల్చలేరు.
ఎదకాలంలో దానిని కోరే ప్రతీ మగజంతువూ దానిని పొందగలదు.
    అప్పుడు దానిని కనుగొనటం తేలిక.
25 యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి.
    ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు.
కానీ, ‘లాభం లేదు! నేను వదల్లేను!
    నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను.
    నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు.

26 “ప్రజలు పట్టుకున్నప్పుడు
    దొంగ సిగ్గుపడతాడు
అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాలవుతారు.
    ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయకులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో తలవంచుకుంటారు.
27 ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు!
    దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు.
ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు.
    దానితో, ‘నీవే మాకు జన్మనిచ్చావు’ అంటారు.
ఆ ప్రజలంతా అవమానం పొందుతారు.
ఆ ప్రజలు నావైపుకు చూడరు.
    వారు విముఖులై నాకు వెన్ను చూపుతారు.
కాని యూదాప్రజలు కష్టాల పాలైనప్పుడు,
    ‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.
28 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి?
    మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము.
యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!

29 “మీరు నాతో ఎందుకు వాదిస్తారు?
    మీరంతా నాకు వ్యతిరేకులయ్యారు.”
ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినది.
30 “యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను.
    కాని అది పనిచేయలేదు.
మిమ్మల్ని శిక్షించినప్పుడు కూడా
    మీరు వెనక్కి మరలలేదు.
మీ వద్దకు వచ్చిన ప్రవక్తలను మీరు మీకత్తులతో చంపారు.
మీరొక భయంకర సింహంలా ప్రవర్తించి వారిని సంహరించారు.”
31 ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి.

“ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా?
    వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా?
‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది.
    యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు.
కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు?
32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!
    ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!
కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.

33 “యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు.
    కావున దుష్టకార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు.
34 మీ చేతులు రక్తసిక్తమైనాయి![i]
    అది పేదవాళ్ల, అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజలను చంపావు. కనీసం వారు నీవు పట్టుకున్న దొంగలైనా కారు. నీవటువంటి చెడ్డ పనులు చేస్తావు.
35 కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’
    అని నీవు చెప్పుకుంటూ ఉంటావు.
అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను,
    ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు.
36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని!
    అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది.
అందుచేత అష్షూరును[j] వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు.
    ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.
37 చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు.
    అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు.
కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు.
    ఎందువల్లనంటే యెహోవా ఆ రాజ్యాలను తిరస్కరించాడు.
“ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే,
    ఆ వ్యక్తి మళ్లీ ఆమెవద్దకు తిరిగి రాగలడా? లేదు. రాలేడు!
    ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు[k] తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా ‘మాలిన్య’ మైపోతుంది.
యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు.
    మరల నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావా?”
అని యెహోవా పలికాడు.
“యూదా, దిశగా ఉన్న కొండ శిఖరాలను చూడు.
    నీవక్కడ తిరుగని చోటు ఉందా? నీవు బాట ప్రక్కన విటుల (అబద్ధపు దేవుళ్ల) కోసం వేచివున్నావు.
ఎడారిలో కూర్చున్న అరబీయునివలె
    నీవక్కడ కూర్చున్నావు.
నీవు దేశాన్ని ‘అపవిత్రం’ చేశావు! ఏమైనంటావా?
    నీవు చాలా దుష్కార్యాలు చేశావు.
    నీవు నాకు విశ్వాసపాత్రంగా లేవు.
నీవు పాపం చేశావు. అందుచే వర్షాలు లేవు.
    వసంత కాలపు వానలూ లేవు.
అయినా నీ ముఖ లక్షణాలు వేశ్యాలక్షణాల్లా ఉన్నాయి.
    నీ అకృత్యాలకు సిగ్గుపడటంకూడా మానివేశావు.
కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు.
‘నా తండ్రీ’ నా బాల్యంనుండి
    ‘నీవు నాకు ప్రియ మిత్రునిలా ఉన్నావు.’
‘దేవుడు నా పట్ల ఎల్లప్పుడూ కోపంగా ఉండడు.
    దేవుని కోపం అల్పమైనది.
    అది శాశ్వతంగా ఉండదు’ అని అంటున్నావు.

“యూదా, నీవీ విషయాలు అంటూనే
    నీవు ఎంత చెడు చేయగలవో అంతా చేస్తున్నావు.”

చెడ్డ తోబుట్టువులు: ఇశ్రాయేలు మరియు యూదా

రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే కాలంలో యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు[l] చేసిన చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వాసరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహాలతో వ్యభిచరించిన పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది. ‘ఈ చెడు కార్యాలన్నీ చేయటం పూర్తయిన పిమ్మట ఇశ్రాయేలు తప్పక నావద్దకు తిరిగి వస్తుంది’ అని నేననుకున్నాను. కాని ఆమె నా వద్దకు రాలేదు. విశ్వాస ఘాతకురాలైన ఇశ్రాయేలు సోదరియగు యూదా ఆమె ఏమి చేసిందో చూసింది. ఇశ్రాయేలు విశ్వాసపాత్రంగా లేదు. ఆమెను నేనెందుకు పంపి వేశానో ఇశ్రాయేలుకు తెలుసు. ఆమె వ్యభిచార దోషానికి పాల్పడినందుకే నేనామెకు విడాకులిచ్చానని ఇశ్రాయేలుకు తెలుసు. కాని అది విశ్యాస ఘాతకురాలైన ఆమె సోదరిని భయపెట్టలేదు. యూదా భయపడలేదు. యూదా కూడా తెగించి వ్యభిచారిణిలా ప్రవర్తించింది. తానొక మరుగులేని వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా ఆమె తన దేశాన్ని ‘మలిన’ (అపవిత్ర) పర్చింది. రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది. 10 ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.

11 యెహోవా నాతో ఇలా చెప్పినాడు “ఇశ్రాయేలు నాకు విశ్వాసపాత్రంగా లేదు. విశ్వాసం లేని యూదా కంటె ఇశ్రాయేలుకు చెప్పుకొనేందుకు ఒక మంచి సాకువుంది. 12 యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు:

“‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’
ఇది యెహోవా వాక్కు.
‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను.
    నేను నిండు దయతో ఉన్నాను.’
ఈ వాక్కు యెహోవాది.
‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను.
13 నీవు నీ పాపాన్ని గుర్తించాలి.
    నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు
    నీ పాపం అదే.
ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు
    నీవు ప్రతి పచ్చని చెట్టు క్రిందా విగ్రహారాధన చేశావు
    నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.’”
ఇదే యోహోవా వాక్కు.

14 “విశ్వాసంలేని ప్రజలారా, నావద్దకు రండి” అని యెహోవా అంటున్నాడు “నేను మీ యజమానిని. ప్రతి నగరంనుంచీ ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి కుటుంబంనుంచీ ఇద్దరు మనుష్యులను తీసుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకొని వస్తాను. 15 అప్పుడు మీకు నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు. 16 ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీరనేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది.

“ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు. 17 ఆ సమయంలో యెరూషలేము నగరం ‘యెహోవా సింహాసనం’ అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు యెరూషలేము నగరంలో కలిసి యెహోవాను స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ మొండి హృదయాలను ఇక ఎంత మాత్రం అనుసరించరు. 18 ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు వంశంతో కలుస్తుంది వారు ఉత్తర ప్రాంతంలో ఒకే చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన రాజ్యంలోకి వారు వస్తారు.”

19 యెహోవానైన నేనిలా అనుకున్నాను,

“మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం.
    మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది.
    ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది.
మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను.
    మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను.
20 కాని తన భర్త పట్ల వంచనగా నడిచే స్త్రీవలె మీరు తయారయ్యారు.
    ఇశ్రాయేలు వంశమా, నీవు నా పట్ల విశ్వాస పాత్రంగా మెలగ లేదు!
    ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
21 నగ్నంగా ఉన్న కొండలమీద రోదన నీవు వినవచ్చు.
    ఇశ్రాయేలు ప్రజలు దయాభిక్ష కోరుకుంటూ ఏడుస్తూ ప్రార్ధన చేస్తున్నారు.
వారు బహు దుష్టులైనారు!
    వారు తమ యెహోవా దేవున్ని మర్చిపోయారు.

22 “విశ్వాసఘాతకులగు ఇశ్రాయేలీయులారా నా వద్దకు తిరిగి రండి.
    నన్నాశ్రయించి రండి.
నా పట్ల వంచనతో
    మెలిగినందుకు క్షమిస్తాను.”

“అవును. మేము నీ వద్దకు వస్తాము.
    నీవు మా యెహోవా దేవుడవు
23 కొండల మీద విగ్రహాలను పూజించుట అవివేకం.
    కొండలమీద ఆడంబరంగా జరిగే పూజా కార్యక్రమమంతా మోసం.
నిజానికి, ఇశ్రాయేలుకు రక్షణ
    యెహోవా దేవుని వద్దనుండే వస్తుంది.
24 ఆ భయంకరమైన బయలుదేవత
    మన తండ్రుల ఆస్తిని మ్రింగివేసింది.
మనం పిల్లలం కావటంతో ఇదంతా జరిగింది.
ఆ భయంకరమైన దేవత[m]
    మన తండ్రుల గొర్రెలను, పశువులను,
    వారి కుమారులను, కుమార్తెలను చంపింది.
25 మనం సిగ్గుతో తలవంచుకుందాం.
    మన అవమానం మనల్ని దుప్పటిలా కప్పివేయనీయండి.
మన యెహోవా దేవునిపట్ల మనం తీవ్రమైన పాపం చేశాం.
    మనం, మన తండ్రులు కూడా పాపానికి ఒడిగట్టాము.
మన చిన్నతనం నుండి ఇప్పటివరకు
    యెహోవా దేవుని ఆజ్ఞను మనం పాటించలేదు” అని చెప్పాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International