Add parallel Print Page Options

యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం

(మత్తయి 10:1-4; మార్కు 3:13-19)

12 ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. 13 ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా,

14 సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు,

అతని తమ్ముడు అంద్రెయ.

యాకోబు,

యోహాను,

ఫిలిప్పు,

బర్తొలొమయి,

15 మత్తయి,

తోమా,

అల్ఫయి కుమారుడు యాకోబు,

జెలోతె[a] అని పిలువబడే సీమోను

16 యాకోబు కుమారుడు యూదా,

యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).

Read full chapter

Footnotes

  1. 6:15 జేలోతె అనగా మతాభిమాని అని అర్థం.