Font Size
మత్తయి 26:26-30
Telugu Holy Bible: Easy-to-Read Version
మత్తయి 26:26-30
Telugu Holy Bible: Easy-to-Read Version
ప్రభు రాత్రి భోజనము
(మార్కు 14:22-26; లూకా 22:15-20; 1 కొరింథీ. 11:23-25)
26 వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” అని అన్నాడు.
27 ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలోవున్న దాన్ని త్రాగండి. 28 ఇది నా ఒడంబడిక[a] రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను. 29 ఈ రోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలసి ద్రాక్షారసాన్ని మళ్ళీ త్రాగే దాకా దీన్ని యిక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
30 వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ల కొండ మీదికి వెళ్ళారు.
Read full chapterFootnotes
- 26:28 ఒడంబడిక కొన్ని గ్రీకు ప్రతులలో “క్రొత్” అని చేర్చబడింది.
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International