Add parallel Print Page Options

పిలాతు సమక్షంలో యేసు

(మత్తయి 27:1-2, 11-14; లూకా 23:1-5; యోహాను 18:28-38)

15 తెల్లవారుఝామున ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు యేసును బంధించి తీసుకెళ్ళి పిలాతుకు[a] అప్పగించారు.

పిలాతు, “నీవు యూదులకు రాజువా?” అని అడిగాడు.

“మీరే అంటున్నారుగా!” అని యేసు సమాధానం చెప్పాడు.

ప్రధానయాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు. అందువల్ల పిలాతు యేసుతో మళ్ళీ, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అని అన్నాడు.

అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.

Read full chapter

Footnotes

  1. 15:1 పిలాతు యూదయ రాష్ట్రపాలకుడు. క్రీ. శ. 26-36.